రాజకీయ నాయకురాలిగా లక్ష్మీ మంచు

తెలుగులో పిట్టకథలు పేరుతో నెట్‌ఫ్లిక్స్ ఒక వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో లక్ష్మీ మంచు, ఈషారెబ్బా, శృతిహాసన్‌, అమలాపాల్‌, జగపతిబాబు, సత్యదేవ్‌, మేఘన, సంజిత్‌ హెగ్డే నటించారు. తరుణ్‌ భాస్కర్‌, నందిని రెడ్డి, నాగ్‌ అశ్విన్‌, సంకల్ప్‌ రెడ్డి ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇటీవలే విడుదలైన ఈ వెబ్ సిరీస్ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ సృష్టించింది.

LAKSHMI MANCHU TELANGANA POLITICIAN

ఫిబ్రవరి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. హిందీలో సూపర్ హిట్ అయిన లవ్ స్టోరీస్‌కు తెలుగు రీమేక్ ఇది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో తెలంగాణకు చెందిన ఒక రాజకీయ నాయకురాలిగా లక్ష్మీ మంచు నటించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మాస్‌లో లక్ష్మీ మంచు మాట్లాడనుందని తెలుస్తోంది. దీని కోసం లక్ష్మీ మంచు బాగా ప్రాక్టీస్ చేస్తోంది.