రవితేజ అభిమానులకు గుడ్‌న్యూస్.. సాయంత్రం నుంచి ఫస్ట్ షో

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమాకు లైన్ క్లియర్ అయింది. నిర్మాత ఠాగూర్ మధుకి సంబంధించిన ఆర్ధిక వ్యవహారాల వల్ల ఈ సినిమా మార్నింగ్, మ్యాట్నీ షో రద్దు కావడంతో.. రవితేజ అభిమానులు నిరాశకు గురయ్యారు. దీంతో ఈ సినిమా రేపు లేదా సంక్రాంతి రోజుల రిలీజ్ అవుతుందని మీడియాలో ఊహాగానాలు హల్‌చల్ చేశాయి. దీంతో ఈ వార్తలపై సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

KRACK MOVIE FROM EVENING

సినిమాను ఈ రోజే విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం నుంచి ఫస్ట్ షో మొదలవుతుందని, థియేటర్లకు వెళ్లి వీక్షించండి అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్వీట్ చేశాడు. అన్నీ సమస్యలు తీరిపోయాయని తెలిపాడు.