అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని కేటీఆర్‌కు ఫిర్యాదు చేసిన కోన‌వెంకట్‌!

టాలీవుడ్ ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన వెంక‌ట్ హైద‌రాబాద్ న‌గ‌రంలోని అక్ర‌మ నిర్మాణాల‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ప్రాంతంలోని అక్ర‌మ నిర్మాణాల గురించి ఐటీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్ర‌యత్నం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం12లోని స‌య్య‌ద్ న‌గ‌ర్‌లో ఎన్నో అక్ర‌మ నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని..

kona

భ‌విష్య‌త్తులో ఈ మురికివాడ‌ల్లో నిర్మిస్తున్న బ‌హుళ అంత‌స్తుల నిర్మాణాలు మేజ‌ర్ ప్రాబ్ల‌మ్స్‌కు దారి తీసే అవ‌కాశం ఉంది ద‌య‌చేసి ఈ విష‌యంపై ప‌రిశీలించండి.. అంటూ మంత్రి కేటీఆర్‌.. జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ ట్యాగ్ చేశారు కోన‌వెంక‌ట్‌. ఇదిలా ఉంచితే కోన‌వెంక‌ట్ ర‌చ‌యిత కాకుండా కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు.