డ్రగ్స్ కేసులో హీరో సోదరికి నోటీసులు

బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు సంచలనం రేపుతూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు సెలబ్రెటీలను అరెస్ట్ చేయగా… రెండు రోజుల క్రితం ప్రముఖ బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ సోదరి కోమల్ రాంపాల్‌కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోNCB) అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాల్సిందిగా ఎన్సీబీ అధికారులు కోరగా.. తనకు ఆరోగ్యం బాగా లేదని, ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత హాజరవుతానని చెప్పారు.

KOMAL RAMPAL DRUGS CASE

కానీ విచారణకు హాజరుకావాల్సిందిగా మరోసారి కోమల్ రాంపాల్‌కి ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో సోమవారం ముంబైలోని ఎన్సీబీ ఆఫీస్‌లో ఆమె విచారణకు హాజరైంది. ఆమె చెప్పి స్టేట్మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు. సాయంత్రం వరకు ఆమెను విచారించారు.