Kollywood: సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ‌ కమెడియ‌న్ మృతి!

Kollywood: సినిమా ఇండ‌స్ట్రీలో వ‌రుస‌గా విషాదాలు నెల‌కొంటునే ఉన్నాయి. ఆనారోగ్య బారిన ప‌డి ప‌లువురు ప్ర‌ముఖులు మ‌ర‌ణించారు.. అలాగే ఇప్పుడు క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప‌లువురు ప్ర‌ముఖులు మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.. ఇక తాజాగా ప్ర‌ముఖ త‌మిళ క‌మెడియ‌న్ గ‌ణేశ‌న్ మ‌ర‌ణించాడు. కొన్ని రోజులుగా ఈయ‌న ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు..ఈ క్ర‌మంలో మార్చి 22న గుండెపోటు రావ‌డంతో తేప‌ట్టి గ‌ణేశ‌న్ మ‌ర‌ణించాడు. ప్ర‌ముఖ Kollywood కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన బిల్లా-2 సినిమాలో న‌టించాడు గ‌ణేశ‌న్‌.. తెలుగులో రేణిగుంట అనే పేరుతో డ‌బ్ అయిన సినిమాలో ప్ర‌ధాన క‌మెడియ‌న్‌గా న‌టించాడు గ‌ణేశ‌న్‌.

Comedian

ఈయ‌న‌కు కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేక మ‌ధురైలోని రాజాజీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చేర్పించారు. అక్క‌డే చికిత్స తీసుకుంటుండ‌గా.. ఒక్క‌సారిగా గుండెపోటు రావ‌డంతో ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ విష‌యం తెలుసుకున్న కోలీవుడ్ ఇండ‌స్ట్రీ న‌టీన‌టులు దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు.. త‌మిళ ఇండ‌స్ట్రీలో ఇప్పుడిప్పుడే క‌మెడియ‌న్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు గ‌ణేశ‌న్‌. చాలా చిన్న వ‌య‌స్సులోనే గ‌ణేశ‌న్ క‌న్ను మూయ‌డం కోలీవుడ్ ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు అంటూ ట్వీట్ చేశాడు Kollywood త‌మిళ ద‌ర్శ‌కుడు శ్రీ‌ను రామ‌స్వామి.‌