మ‌హేశ్ కోసం బ‌రువు పెరుగుతున్న కీర్తి సురేశ్‌..

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు హీరోగా తాజా చిత్రం స‌ర్కార్ వారి పాట.. ప‌రుశురాం ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో మ‌హేశ్ స‌ర‌స‌న కీర్తి సురేశ్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ మొద‌లుకానుంది. ఈ నెల 26నుంచి ఈ సినిమా షూటింగ్ 20రోజుల పాటు దుబాయ్‌లో నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర‌బృందం. ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జ‌రిగే మోసాల నేప‌థ్యంలో ఉండ‌నుంద‌ని మొద‌టినుంచి ప్ర‌చారం జ‌రుగుతుంది.

mahesh keerthi

అయితే.. ఇటీవ‌లే బాగా స‌న్న‌బ‌డి కొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన కీర్తి సురేశ్.. డైరెక్ట‌ర్ ప‌రుశురాం సూచ‌న‌ల మేర‌కు ఈ సినిమా కోసం కాస్త బొద్దుగా మార‌నుంద‌ట‌. ఈ సినిమాలో త‌న పాత్ర‌కు అనుగుణంగా కీర్తి సురేశ్ కాస్త బ‌రువు పెర‌గ‌నుంద‌ని స‌మాచారం. ఇక ఈ సినిమాను న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి, రామ్ ఆచంట‌, గోపీ ఆచంట నిర్మిస్తుండ‌గా.. ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కురుస్తున్నారు. ఇదిలా ఉంటే గ‌తేడాది మ‌హేశ్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.