బాయ్‌ఫ్రెండ్‌తో బుక్కైన మహేష్ హీరోయిన్

‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రియుడితో కలిసి మీడియాకి చిక్కింది. న్యూ ఇయర్‌ను ఎంజాయ్ చేసేందుకు సెలబ్రెటీలందరూ వెకేషన్లను వెళుతున్నారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత భర్త నాగచైతన్యతో కలిసి గోవా వెళ్లింది. ఈ జంట గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను జరుపుకోనుంది. ఇంకా పలువురు సెలబ్రెటీలు న్యూ ఇయర్‌ను గ్రాండ్‌కు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు.

kiyara advani with lover

ఇప్పుడు కియారా అద్వానీ తన బాయ్‌ఫ్రెండ్‌, బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ మల్హోత్రాతో కలిసి మాల్ధీవులకు చెక్కేసింది. ఈ ప్రేమపక్షులు అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారు. మాల్ధీవులకు వెళ్లేందుకు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వీరిద్దరు కలిసి వచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీడియా కంట పడకుండా ఉండేందుకు కియారా ముఖం దాచుకుని, పెద్ద ముసుగు ధరించి సిద్దార్థ్ ఎయిర్‌పోర్ట్‌కి కారులో వచ్చారు.

ఇద్దరు కలిసి ఎయిర్‌పోర్ట్‌కి రావడం, మాల్ధీవులకు వెళ్లడంతో వీరిద్దరి ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతోంది. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ వీరిద్దరూ ఎప్పుడూ కన్ఫామ్ చేయలేదు. ఇప్పుడు ఇద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్లడంతో.. వీరి లవ్ కన్ఫామ్ అయినట్లే కనిపిస్తోంది.