నితిన్‌పై పగ తీర్చుకుంటానన్న కీర్తి సురేష్

మహానటి సినిమాతో తన నటనతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది కీర్తి సురేష్. ఈ సినిమాతో జాతీయ పురస్కారాన్ని అందుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ఈ ముద్దుగుమ్మ బిజీబిజీగా ఉంది. మరోవైపు మిస్ ఇండియా లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా పెరు తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఉంది.

keerty suresh

ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట సినిమాతో పాటు నితిన్ హీరోగా వస్తున్న రంగ్ దే సినిమాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడూ పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది. తాజాగా దుబాయ్‌లో జరుగుతున్న రంగ్‌దే షూటింగ్‌లో కీర్తి సురేష్ పాల్గొంది. ఈ సందర్భంగా షూటింగ్‌లో కీర్తి సురేష్ నిద్రపోతున్న ఫొటోలను నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది.

షూటింగ్‌తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్‌ అవుతోందంటూ నితిన్ కామెంట్ చేశాడు. దీనిపై తాజాగా కీర్తి సురేష్ స్పందించింది. సెట్లో ఎప్పుడూ నిద్రపోకూడదనే గుణపాఠం నేర్చుకున్నానని, నితిన్‌పై ఖచ్చితంగా పగ తీర్చుకుంటానంటూ కీర్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.