భయంకరమైన ‘దండుపాళ్యం’ పాత్రలో కీర్తి సురేష్

‘మహానటి’ సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. సావిత్రి పాత్రలో ఆమె నటన అద్భుతమని చెప్పవచ్చు. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్.. ఆ తర్వాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో ఎక్కువగా నటించింది. ఒకవైపు కమర్షియల్ రొమాంటిక్ సినిమాల్లో నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది.

keerty suresh

అయితే ఇప్పుడు కీర్తి సురేష్ భయంకరమైన ‘దందుపాళ్యం’ తరహా పాత్రలో నటిస్తోంది. దండుపాళ్యం సినిమాలో దండుపాళ్యం బ్యాచ్‌ను చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఇప్పుడు యువన్ శంకర్ రాజా దర్శకత్వంలో వస్తున్న ‘సాని కాయిదం’ సినిమాలో అలాంటి తరహా పాత్రలో కీర్తి నటిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలవ్వగా.. ఇందులో తలకు గాయాలతో డీ గ్లామర్‌గా చీర కట్టులో కాళ్లపై కూర్చుని ముందు ఆయుధాలతో కీర్తి సురేష్ కనిపించింది. ఈ లుక్ చూడటానికి చాలా భయంకరంగా ఉంది.