‘కాంట్రవర్సీ’ లో ఇరుక్కున్న ‘కీర్తి సురేష్’ మొదటి సినిమా!!

నేను శైలజా సినిమాతో 2016లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. అయితే ఆ సినిమా కంటే ముందే ఆమె అయినా ఇష్టం నువ్వు అనే ఒక తెలుగు సినిమా చేసింది. ఆర్ట్ డైరెక్టర్ నిర్మాత చంటి అడ్డాల ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. అయితే ఎందుకో గాని కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం అప్పుడే విడుదలకు నోచుకోలేకపోయింది.

ఇక ఇప్పుడు, అయినా ఇష్టం నువ్వు టైటిల్ ని తీసేసి ‘జనకితో నేను’ గా మార్చారు. ఈ చిత్రం అక్టోబర్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. ఇంతలో నట్టి కుమార్ అనే నిర్మాత చండి అడ్డాల ఈ చిత్రం యొక్క హక్కులను చాలా కాలం క్రితం తనకు అమ్ముకున్నాడని ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది. చంటి అడ్డాల నుండి ఈ చిత్ర హక్కులను తాను ఇదివరకే కొనుగోలు చేశానని నిరూపించడానికి తన వద్ద అన్ని డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని నట్టి కుమార్ పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం వలన కీర్తి సురేష్ మొదటి సినిమా కనీసం ఓటీటీలో అయినా రిలీజ్ అవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.