కార్తీ, రష్మిక జంటగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కొత్త చిత్రం

ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తీ – డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందనుంది. కార్తీ 19 వ సినిమా గా రూపొందుతున్న ఈ చిత్రంలో గీత గోవిందం ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం సూర్య తో ‘ఎన్ జీ కె’ నిర్మిస్తున్న ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చ్ రెండవ వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.

కార్తీ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రానికి నిర్మాతలు – ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
దర్శకత్వం – భాగ్యరాజ్ కన్నన్