మీడియా ఆరోపణలపై ‘ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ సీరియస్.. మద్దతు ఇచ్చిన ‘కరీనా కపూర్’!!

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక అలజడికి దారితీసింది. ముఖ్యంగా, ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు, రియాపై మీడియాలో వచ్చే కథనాలు చిత్ర పరిశ్రమలో సరికొత్త వివాదాలకు కారణమవుతోంది. ఇప్పటికే, రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక బాలీవుడ్ పై వస్తున్న ఆరోపణలపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆ ఆరోపణలను ఖండిస్తూ మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కరీనా కపూర్, జోయా అక్తర్ తదితరులు కూడా దీనికి మద్దతు ఇచ్చారు. కరీనా మాట్లాడుతూ.. “గత కొన్ని నెలలుగా భారతీయ చిత్ర పరిశ్రమ ప్రతిష్టపై నిరంతరాయంగా అబద్దాలతో దాడులు చేస్తున్నారు. ఇండస్ట్రీ మొత్తాన్ని అగౌరపరిచాడనికి ఒక యువ స్టార్ విషాద మరణంను కూడా ఒక సాధనంగా కొందరు ఉపయోగించారు. సినిమాల్లోకి ధైర్యంగా ప్రవేశించేవారిని కూడా అపహాస్యం చేసేలా చేశారు. డ్రగ్స్ క్రిమినన్స్ అంటూ అబద్దలతో ప్రతి ఒక్కరిపై నిందలు వేశారు. న్యూస్ రేటింగ్‌లు, పాఠకుల సంఖ్య, వెబ్ సైట్ విక్షణలను పెంచడానికి మీడియా చేసిన పని నిజంగా ఎంతమాత్రం కరెక్ట్ కాదు” అని కరీనా పేర్కొన్నారు.