జనాలు పిచ్చోళ్ళు అంటున్న కరీనా కపూర్

ప్రస్తుతం నెపోటిజమ్ పై అనేక రకాల కామెంట్స్ వస్తున్న విషయం తెగేలిసిందే. బాలీవుడ్ లో వారసత్వం నుంచి వచ్చిన స్టార్స్ పై నెటిజన్స్ ఒక రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. అయితే ఆలోచించకుండా అందరిని అలా తిట్టడంలో అర్థం లేదని కరీనా కపూర్ ఆరోపించింది. అలా తిట్టే జనాలు నిజంగా పిచ్చివాళ్లే అంటూ ఆమె వ్యాఖ్యానించడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కరీనా మాట్లాడుతూ.. ఒక స్టార్ హోదా నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంలో ఎలాంటి పొరపాటు ఉందొ నాకు అర్థం కావడం లేదు. షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా వంటి వారు జనాలకు నచ్చారు కాబట్టే స్టార్స్ అయ్యారు. ఇక అదే జనాలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారిని కూడా లైక్ చేస్తున్నారు. స్టార్స్ పిల్లలకు మొదటి సినిమాతో అవకాశం ఈజిగానే వస్తుంది. కానీ ఆ తరువాత ఆడియెన్స్ లో ఎంతో కొంత క్రేజ్ ఉంటేనే నిలదొక్కుకుంటారు. ఈ విషయం అందరికి తెలిసిన తెలియనట్టు ఉంటారు. ఎవరైనా సరే జనాలు ఆదరిస్తేనే సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ అవుతారని కరీనా తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.