‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా మొక్కలు నాటిన క్రికెట్ దిగ్గజం ‘కపిల్ దేవ్’!!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విన్నూత్న రూపంలో చాలా బ్రహ్మాండంగా ముందుకు కొనసాగుతు ప్రముఖుల మన్నలను పొందుతోంది.
ఇందులో భాగంగా నేడు ఢిల్లీలోని సుందర్ నగర్ తన నివాసంలో మొక్కలు నాటిన క్రికెట్ దిగ్గజం భారతదేశం క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.
ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వాతావరణ కాలుష్యం తగ్గి మంచి వాతావరణం కావాలని ఆశిద్దాం అని. అందుకోసం భారతీయులందరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. మన భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించడం మన అందరి బాధ్యత అన్నారు.