

మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన కీలక హార్డ్ డిస్క్ మాయమైన ఘటన టాలీవుడ్లో కలకలం రేపింది. ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి హైదరాబాద్కు DTDC కొరియర్ ద్వారా పంపిన ఈ హార్డ్ డిస్క్లో సినిమా యొక్క ముఖ్యమైన VFX సన్నివేశాలు ఉన్నాయి. మే 25న ఆఫీస్ బాయ్ రఘు ఈ డిస్క్ను స్వీకరించి, చరిత అనే వ్యక్తికి అప్పగించగా, ఆమె దానితో పరారైనట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో చిత్ర బృందం షాక్లో ఉంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హార్డ్ డిస్క్లో దాదాపు 90 నిమిషాల నిడివి గల సన్నివేశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని బృందం అనుమానిస్తోంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.