మరో వివాదంలో బాలీవుడ్ క్వీన్

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఎప్పుడూ ఏదోక వివాదంతో వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ఆమె ఎవరినీ లెక్క చేయదు. ఆమెకు నచ్చకపోతే ఎవరినైనా నోటికి వచ్చినట్లు తిడుతూ ఉంటుంది. అలాంటి నోటి దురుసుతో ఇప్పుడు మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఇటీవల రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహపై కంగనా అవమానకర వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్ 3న ట్విట్టర్‌లో కుష్వాహా పొట్టితనాన్ని అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడంపై దుమారం రేగింది.

KANGANA RANOUT

ఈ వ్యాఖ్యలకు గాను కంగనాపై గయా సివిల్ కోర్టులో ఫిర్యాదు నమోదైంది. కంగనాపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏ నాయకుడిపైనా అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని వినయ్ కుష్వాహా తరపు న్యాయవాది శంభు ప్రసాద్ చెప్పారు. ఒక వ్యక్తిని కించపరచడం సరికాదని, అందుకే ఆమెపై కోర్టులో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఇటీవలే ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపిన గాయకుడు దిల్జిత్ దోసంజ్‌పై కంగనా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆమె వ్యాఖ్యలకు దిల్జిత్ కౌంటర్ ఇవ్వడంతో.. కొన్నిరోజుల పాటు ఈ వివాదం నడిచింది. అది మరువకముందే ఇప్పుడు మరో వివాదంతో కంగనా వార్తల్లోకి ఎక్కింది.