డైరెక్టర్‌గా మారబోతున్న బాలీవుడ్ క్వీన్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి డైరెక్టర్‌గా మారబోతోంది. తన నటనతో ఇప్పటికే రెండుసార్లు ఉత్తమనటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న ఈమె.. చివరిగా ఝాన్సీరాణి లక్ష్మీభాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక సినిమాలో నటించింది. ఆ సినిమాకు డైరెక్టర్ క్రిష్‌తో కలిసి సంయుక్తంగా దర్శకత్వం కూడా చేసి తనలోని కొత్త టాలెంట్‌ను కూడా బయటపెట్టింది.

అయితే ఈ సారి డైరెక్టర్‌గా కంగనా సోలోగా ఒక సినిమాను తెరకెక్కించనుంది. అయోధ్య రామమందిరం నిర్మాణం, సుప్రీంకోర్టు తీర్పు, తదితర అంశాలపై ఒక సినిమా తెరకెక్కబోతుండగా.. దీనికి కంగనా దర్శకత్వం వహించనుంది. ఇక మణికర్ణిక రిటర్న్స్ ది లెజెండ్ ఆఫ్ దిడ్డా అనే సినిమాకు కూడా కంగనా దర్శకత్వం వహించనుందని సమాచారం. ఈ సినిమాను మణికర్ణిక నిర్మాత కమల్ జైన్ నిర్మిస్తాడని తెలుస్తోంది.