Tollywood: అన‌సూయ‌ను చూస్తుంటే నాకేదో అనిపించింది: హీరో కార్తీకేయ

Tollywood: టాలీవుడ్ యువ హీరో కార్తీకేయ ఆర్ఎక్స్‌100 చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం చావు క‌బురు చ‌ల్ల‌గా రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో నిన్న ప్రిరీలిజ్ వేడుక‌ను నిర్వ‌హించారు చిత్ర‌బృందం. ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ విచ్చేసి.. చిత్ర‌బృందానికి అభినంద‌న‌లు తెలిపారు. కాగా ఈ సినిమాలో పైనా ప‌టారం లోనా లోటారం అంటూ ఐటెం సాంగ్‌లో రెచ్చిపోయిన అన‌సూయ‌.. ప్రిరిలీజ్ వేడుక‌ల్లో కూడా ఎంతో అందంగా ఈ పాట‌కు డ్యాన్స్ చేసి అక్క‌డ ఉన్న యువ‌కుల్లో మంట‌లు పెట్టింది. అయితే దీనిపై Tollywood కార్తికేయ మాట్లాడుతూ..

Anasuya karthikeya

అన‌సూయ గారు సెట్‌కు మొద‌టి సారి వ‌చ్చిన స‌మయంలో నేను ఆమెకు క‌నిపించ‌కుండా కాస్త దూరంగా వెళ్లి కూర్చొని ఆమెను అలాగే చూస్తూంటే నాకేదో అలా అనిపించింది. ఎందుకంటే ఆమె ముందే నిల‌బ‌డి క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తే బాగోదు కదా.. కాబ‌ట్టి ప‌క్క‌కు వెళ్లి కూర్చుని చూస్తూ ఉండిపోయాను.. నిజంగా నేను అన‌సూయ‌గారికి అభిమానిని.. నా సినిమాలో నాతో పాటు సాంగ్ చేసినందుకు అన‌సూయ‌గారికి ధ‌న్య‌వాదాలు అంటూ తెలిపారు కార్తికేయ‌. ఇక ఈ చిత్రంలో కార్తికేయ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ Tollywood చిత్రం మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.