‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ హోస్ట్‌గా ఎన్టీఆర్

ఒకవైపు సిల్వర్ స్క్రీన్‌తో పాటు మరోవైపు బుల్లితెరపై కూడా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తెలుగు బిగ్‌బాస్-1కు అత్యధిక టీఆర్‌పీ రేటింగ్స్ రాగా.. దీంతో బుల్లితెరపై కూడా ఎన్టీఆర్ తన సత్తా చూపించాడు. ఎన్టీఆర్ హోస్టింగ్‌కు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్ హోస్టింగ్ వల్ల బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ సక్సెస్ అయింది.

hosting ntr

అయితే త్వరలో బుల్లితెరపై మరోసారి ఎన్టీఆర్ దర్శనమివ్వనున్నాడు. తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 5కు తారక్ హోస్టింగ్ చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ షో జెమినీ టీవీలో ప్రసారం కానుందని తెలుస్తోంది. ఈ షోకు కొత్త టైటిల్ పెట్టనున్నారని సమాచారం. ఈ షో కోసం అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్ సెట్ ఏర్పాటు చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం RRR షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు.

అయితే ఆ సినిమా చేస్తూనే ఈ షోను ఎన్టీఆర్ హోస్ట్ చేస్తాడని చెబుతున్నారు. త్వరలోనే దీనిని సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మీలో ఎవరు కోటీశ్వరుడు మూడు సీజన్లను నాగార్జున హోస్ట్ చేయగా.. నాలుగో సీజన్‌ను చిరంజీవి హోస్ట్ చేశాడు. ఇప్పుడు ఐదో సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నాడన్న మాట.