హీరోగా మారిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్

టాలీవుడ్ పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇప్పటివరకు డ్యాన్స్ మాస్టర్‌గానే మనకి తెలుసు. ఎన్నో సినిమాలతో కొరియాగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్.. బుల్లితెరపై పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా పనిచేశారు. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ కొత్త అవతారమెత్తాడు. హీరోగా కూడా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇవాళ రామానాయుడు స్టూడియోలో జానీ మాస్టర్ కొత్త సినిమా ప్రారంభమైంది. వి.వి వినాయక్ తొలి షాట్‌కు క్లాప్ కొట్టి గౌరవ దర్శకత్వం వహించాడు.

johnny master

నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేశారు..మురళీరాజ్ తియ్యాన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ‘హిప్పీ’ ఫేమ్ దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వలేదు.

జానీ మాస్టర్ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ సినిమాలతో కలిసి ఇప్పటివరకు మొత్తం 150 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇప్పటికే ప్రభుదేవా, అమ్మా రాజశేఖర్, రాఘవ లారెన్స్ ఇప్పటికే హీరోలుగా ఎంట్రి ఇచ్చి సక్సెస్ అయ్యారు. మరి ఇప్పుడు జానీ మాస్టర్ హీరోగా సక్సెస్ అవుతారా?.. లేదా? అనేది చూడాలి.