ప‌వ‌న్ చేతికి జ‌న‌సేన బ్యాడ్జీ.. నిర‌స‌న‌లు చిహ్నాంగా ధ‌రించాలంట‌!

అవ‌మానంతో జ‌న‌సేన నేత వెంగ‌య్య నాయుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ఈ రోజు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వెంగ‌య్య‌ కుటుంబ‌స‌భ్యుల‌ను పరామ‌ర్శించ‌డానికి వెళ్లారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ప్ర‌కాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశ‌ల్‌ను కలిసిన సంద‌ర్భంగా ప‌వ‌న్ చేతికి ఓ ప్ర‌త్యేక జ‌న‌సేన సింబ‌ల్ ఉన్నా న‌ల్ల బ్యాడ్జి ధ‌రించి క‌నిపించాడు. ఆయ‌న‌తో పాటు నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా ఆ న‌ల్ల బ్యాడ్జిని ధ‌రించాడు..

badge

ఇంత‌కీ ఆ న‌ల్ల బ్యాడ్జీ ఎందుకు ధ‌రించారు అంటే.. ఇక‌పై జ‌న‌సేన పార్టీ త‌ర‌పున నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఈ విధ‌మైన ప్ర‌త్యేక న‌ల్ల బ్యాడ్జిల్ ధరించాల‌ని ప‌వ‌న్ ముఖ్య ఉద్దేశామంట‌. అలాగే పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టిన‌పుడు, అధికార‌ప‌క్ష నేతలు దాడులు చేసిన‌పుడు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే సంద‌ర్భాల్లో చేతికి ఈ బ్యాడ్జి ధ‌రించాల‌న్న‌ది ప‌వ‌న్ ఆలోచ‌న అని, ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన ఈ న‌ల్ల బ్యాడ్జిపై జ‌న‌సేన పార్టీ చిహ్నం గుర్తుతో ముద్రించి ఉన్నా దీనిని జ‌న‌సేన పార్టీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.