Tollywood: షాకింగ్ ఫోటోను పోస్ట్ చేసిన‌ జ‌గ‌ప‌తిబాబు.. ప్ర‌శ్నించిన నెటిజ‌న్లు!

Tollywood: ప్ర‌ముఖ సినీ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు సోష‌ల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసి అభిమానుల‌కు షాకిచ్చారు. దీంతో షాక్‌కు గురైన అభిమానులు, నెటిజ‌న్లు సోష‌ల్‌మీడియాలో జ‌గ్గూభాయ్‌కి ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. అస‌లు ఇంత‌కీ ఆ షాకింగ్ ఫోటో ఏంటీ? జ‌గ‌ప‌తిబాబుకు ప్ర‌శ్న‌లు ఎందుకు వేస్తారు? వివ‌రాల్లోకి వెళితే.. జ‌గ‌ప‌తిబాబు తాజాగా ఓ ఫోటోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలో జ‌గ‌ప‌తిబాబు సిలువ‌పై ఉన్న ఏసుక్రీస్తు గెట‌ప్‌లో కనిపిస్తున్నారు.

jaggubhai

త‌లకు ముళ్ల కిరీటం సివ‌కు మేకుల‌తో కొట్టిన చేతులు ర‌క్తం కారుతున్న ముఖంతో ఈ ఫోటోలో కనిపిస్తున్నారు జ‌గ‌ప‌తిబాబు. ఈ పోస్ట్‌పై అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ పోజు ఏదైనా సినిమా కోసమా అని అభిమానులు ఆయన‌ను ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి జ‌గ‌ప‌తిబాబు ఇంకేమి స్పంద‌న ఇవ్వ‌లేదు. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌స్తుతం జ‌గ‌ప‌తిబాబు విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో FCUK చిత్రంలో న‌టిస్తున్నాడు. ఫిబ్ర‌వ‌రి 12న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.