జబర్దస్త్ లో కరోనా కలకలం.. హైపర్ ఆదికి పాజిటివ్

బెస్ట్ తెలుగు కామెడి షోగా క్రేజ్ అందుకున్న ‘బజర్దస్త్’ ప్రోగ్రామ్‌ కరోనా కోరల్లో చిక్కుకుంది. చివరికి అందులోని ఆర్టిస్టులు కూడా కరోనా బారిన పడతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మికి కరోనా సోకినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో కమెడియన్ హైపర్ ఆదికి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది.

మరొక షాకింగ్ విషయం ఏమిటంటే సుడిగాలి సుధీర్‌‌ కంటే ముందే ఆది వైరస్ బారిన పడ్డారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికే ఆది కోలుకున్నట్లు సమాచారం. ఇంకా ఈ విషయంలో అఫీషియల్ గా ఎలాంటి సమాచారం అయితే రాలేదు. కేవలం సోషల్ మీడియాలలో అలాగే కొన్ని ప్రముఖ మీడియాలలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక జబర్దస్త్ ప్రోగ్రామ్‌ ఇప్పుడు వాయిదా వేసినట్లు కూడా టాక్ వస్తోంది. రీసెంట్ గా దసరా కోసం కొన్ని స్పెషల్ ప్రోగ్రాంలు కూడా నిర్వహించగా అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు కరోనా టెస్టులు చేయించుకుంటున్నట్లు సమాచారం.