Tollywood: జాతిర‌త్నాలు నుంచి చిట్టి వీడియో సాంగ్ రిలీజ్..

Tollywood: న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌గా తెర‌కెక్కిన చిత్రం జాతిర‌త్నాలు. ఈ చిత్రం మార్చి 11న రిలీజ్ అయి బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ కురిపించింది. ఇప్ప‌టికీ కూడా క‌లెక్ష‌న్స్ వ‌స్తూనే ఉంది ఈ చిత్రానికి. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో జాతిర‌త్నాలు టీమ్‌కు అభినంద‌న‌ల వెల్లువ‌లు వ‌చ్చాయి..

అలాగే ఈ చిత్రంలో చిట్టీ నీ న‌వ్వంటే ల‌క్ష్మీ ప‌టాసే సాంగ్ అయితే ప్రేక్ష‌కులు ఎంతో ఫిదా అయ్యారు. ఈ సాంగ్‌ను రామ్ మిరియాల ఆల‌పించ‌గా.. ర‌థ‌న్ స్వ‌రాలు అందించారు. ఇక ఈ మైండ్ బ్లోయింగ్ సాంగ్‌ను తాజాగా వీడియో రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై నాగ్ అశ్విన్ నిర్మించ‌గా.. అనుదీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.‌