Tollywood: జాతిర‌త్నాలు నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్‌..

Tollywood: న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శిని ప్ర‌ధాన‌పాత్ర‌లుగా తెర‌కెక్కుతున్న చిత్రం జాతిర‌త్నాలు. కామెడీ ఓరియెంట్‌డ్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి అనుదీప్ కేవీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. న‌వీన్ పోలిశెట్టి న‌టించిన డెబ్యూ చిత్రం ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌ బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఘ‌న విజ‌యం సాధించిన విష‌య‌మే తెలిసిందే. ఈ చిత్రంతో న‌వీన్ పోలిశెట్టి త‌న న‌ట‌న‌తో కామెడీ టైమింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించారు.

Naveenpolishetty

Tollywoodఇప్పుడు మ‌రోసారి జాతిర‌త్నాలు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వులు పూయించాడానికి శివ‌రాత్రి కానుక‌గా మార్చి11న వ‌స్తున్నాడు న‌వీన్‌. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. సూ సూడు హీరోలు.. ఒట్టి బుడ్డ‌రు ఖానులు.. వాల్యూ లేని వ‌జ్రాలు మ‌న జాతిర‌త్నాలు అంటూ సాగే పాట ఎంత‌గానో అల‌రిస్తోంది. ఈ పాట‌కు లిరిక్స్ శ్యామ్ అందించ‌గా.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌థ‌న్ ఈTollywood చిత్రానికి స్వ‌రాలు అందించారు. ఇక ఈ పాట‌ను రాహుల్ సిప్లిగంజ్ త‌న‌దైన శైలిలో ఆల‌పించాడు. ఈ చిత్రాన్ని స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నాడు.