Tollywood: ఆస్కార్ బ‌రిలో జాతిర‌త్నాలు..

Tollywood: న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో జాతి ర‌త్నాలు తెర‌కెక్కి ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో.. స్వ‌ప్నా మూవీస్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తెలుగు రాష్ట్ర‌ల్లోనే కాకుండా యూఎస్‌లో కూడా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా క‌లెక్ష‌న్ల సునామీని కురిపించింది. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. కాగా తాజాగా ఈ చిత్రం ఆస్కార్ నామినేష‌న్ ద‌క్కింది.. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసింది.

jaathirathnalu Movie team

అయితే ఈ పోస్ట్‌ను చూసి నెటిజ‌న్ల్ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకున్నారు. ఆస్కార్‌కు నామినేష‌న్ అయితే ఆనంద‌ప‌డాలి కానీ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వ‌డం ఏంటీ అనుకుంటున్నారా?.. అస‌లు విష‌యం ఏప్రిల్ ఫూల్ చేసేందుకు జాతి ర‌త్నాలు టీం ఇలా చేసింది.. ఆస్కార్ లేదు ఏమీ లేద‌ని ఆ త‌ర్వాత తేలిపోయింది. ఇటీవ‌లే ఆస్కార్ అవార్డులు వ‌చ్చాయి. మ‌ళ్లీ ఇదేక్క‌డి ఆస్కార్ నామినేష‌న్ అనుకున్నారంతా.