Telangana: జాతిర‌త్నాలు మూవీ టీంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన శివ‌సేన‌!

Telangana: న‌వీన్ పోలీశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన జాతిర‌త్నాలు చిత్రం ఇటీవ‌లే విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంది. ముగ్గురి న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు క‌డుపుబ్బా న‌వ్వుకుంటున్నారు. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ కురిపిస్తుంది. కాగా తాజాగా ఈ సినిమాపై తెలంగాణ విభాగం శివ‌సేన నేతలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

ప్ర‌ముఖ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు రామ్ ప్ర‌సాద్ బిస్మిల్‌ను ఉరి వేసేముందు ఆయ‌న స‌ర్ఫ‌రోష్ కీ త‌మ‌న్నా హ‌బ్ హ‌మారే దిల్ మే హై అంటూ పాడిన పాట‌ను.. జాతిర‌త్నాలు చిత్రంలో అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో ఆల‌పించార‌ని.. ఆ గేయంలో టాలీవుడ్ హీరోయిన్ల పేర్లు చేర్చి వ్యంగ్యంగా మార్చేశార‌ని శివ‌సేన నేత‌లు ఆరోపించారు. ఈ మేర‌కు జాతి ర‌త్నాలు ద‌ర్శ‌కుడు, న‌టీ న‌టులు, నిర్మాత‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకువాల‌ని.. తెలంగాణ విభాగం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమా గంగాధ‌ర్‌తో పాటు ప‌లువురు నేత‌ల‌తో హైద‌రాబాద్‌లోని కాచిగూడ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.