కొండేపూడి నిర్మలకు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ స్మారక సాహితీ పురస్కారం!!

కీర్తిశేషులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ పేరు మీదుగా వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సాహితీ పురస్కారం 2020 సంవత్సరానికి శ్రీ కవి శిఖామణి గారికి ప్రకటించిన విషయం తెలిసినదే. అదే పురస్కారానికి 2021 సంవత్సరానికి శ్రీమతి కొండేపూడి నిర్మల గారిని ఎంపిక చేయడమైంది.
29.05.2021(శనివారం) నాడు జూమ్ మీటింగ్ ద్వారా సభ నిర్వహించి వీరికి అవార్డుల ప్రదానం చేయడానికి నిర్ణయించటమైంది.