ఆ విషయంలో అందరికంటే నెంబర్ వన్ అమితాబ్ బచ్చన్

kbc amitabh bachchan

సెలబ్రిటీలను ఒక బ్రాండ్ గా పేర్కొనడం ఆనవాయితీగా వస్తోంది. వారు చేసే పనితో పాటు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ప్రవర్తన జనాలకు నచ్చితే ఆకాశానికి ఎత్తేస్తారు. ఇక మీడియాలో వారి బ్రాండ్ విలువ కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇక రీసెంట్ గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (IIHB) అనే విషయంపై ఒక వివరణ ఇచ్చింది. మనుషులలో అత్యంత సెలెబ్రెటీ బ్రండ్ కలిగిన వారి లిస్ట్ ని కూడా విడుదల చేశారు.

TIARA రీసెర్చ్ (ట్రస్ట్, ఐడెంటిఫై, అట్రాక్టివ్, రెస్పెక్ట్ అండ్ అప్పీల్) అనే పరిశోధనలో 2020 నివేదిక ప్రకారం, అమితాబ్ బచ్చన్ భారతదేశం యొక్క అత్యంత విశ్వసనీయమైన సెలబ్రెటీ అని తేలిసింది. అలాగే గౌరవనీయమైన ప్రముఖ వ్యక్తి అని జనాల నుంచి స్పందన వచ్చింది. గతంలో బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్‌కు ఆ గౌరవ స్థానం ఉండగా, హాస్యనటుడు కపిల్ శర్మకూడా భారతీయ టీవీ పరంగా అత్యంత గౌరవనీయమైన వ్యక్తి గుర్తింపు పొందారు. ఇక భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని క్రీడలలో ఆధిక్యంలో ఉండగా, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అత్యంత గౌరవనీయమైన మరియు నమ్మదగిన ప్రముఖ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు.