Tollywood: టాలీవుడ్ మ‌రో య‌దార్థ ఘ‌ట‌న ఆధారంగా “ఇక్షు” ప్రారంభం..

Tollywood: పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై హనుమంతరావు నాయుడు, డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో డాక్టర్ అశ్విని నాయుడు నిర్మాతగా.. ఋషిక దర్శకత్వంలో , రామ్ అగ్నివేష్ కథానాయకుడిగా “ఇక్షు” చిత్రం ప్రారంభమై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని దర్శకులు ఋషిక తెలిపారు. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాము. ఈ నెలాఖరునుండి మొదలయ్యే రెండవ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి అవుతుంది. ఈ Tollywood సినిమా చాలా బాగా వస్తుందని, మేము ఏదైతే అనుకుంటున్నామో.. అనుకున్నది అనుకున్నట్టుగా దర్శకులు చాలా బాగా తెరకెక్కిస్తున్నారని, ప్రస్తుతం సాంగ్స్ రికార్డింగ్ అయిపోయి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చిత్ర Tollywood నిర్మాత అశ్వినీ నాయుడు తెలిపారు.

ఈ మధ్య రిలీజ్ అయిన “ఇక్షు” టైటిల్ పోస్టర్ కు మంచి ఆదరణ వచ్చింది. త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ తో మీ ముందుకు వస్తానని దర్శకులు ఋషిక తెలిపారు. నటీనటులు రాజీవ్ కనకాల, కాళికేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిద, కెప్టెన్ చౌదరి, తదితరులు న‌టిస్తున్నారు. Tollywood సాంకేతిక నిపుణులు కథ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం :- ఋషిక, మ్యూజిక్ :- వికాస్ బాడిస, ఎడిటింగ్ :- ఎస్.బి ఉద్ధవ్, కెమెరా :- నవీన్ తొడిగి, ఆర్ట్స్ :- రాజు, పాటలు :- కాసర్ల శ్యామ్, కొరియోగ్రఫీ :-మనిత శ్రీనివాస్, మాటలు :- మున్నా ప్రవీణ్, మూల కథ :- మనోహర, కో- డైరెక్టర్ :- మురళీకృష్ణ.ఎస్, సూర్య బండారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- సుజిత్ కుమార్ గుత్తుల, చిత్రం శ్రీను, క్యాస్టూమ్స్ :- అయ్యప్ప గుంటూరు, మేకప్ :- నారాయణ, మేనేజర్ :- సి.హెచ్. శ్రీనివాస్, పోస్టర్ డిజైనర్ :- వివ, పబ్లిసిటీ డిజైనర్ :- వివారెడ్డి రవిప్రసాద్ యూనిట్,సారథి స్టూడియోస్, పి ఆర్ ఓ :-మధు వి.ఆర్.