AAA సినిమాస్ మల్టీప్లెక్స్ పూజా కార్యక్రమానికి హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

హైద్రాబాద్ సిటీలో మరో మల్టీప్లెక్స్ రానుంది. అమీర్ పేట్‌లో AAA మల్టీప్లెక్స్ రానుంది. సిటీకి లాండ్ మార్క్‌లా ఈ మల్టీప్లెక్స్ ఉండబోతోంది. నారాయణ్ దాస్ నారంగ్, అల్లు అరవింద్, మురళీ మోహన్, ఎన్ సదానంద్ గౌడ్‌ల భాగస్వామ్యంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మితమవుతోంది.

సత్యం థియేటర్‌కు ఉన్న విశిష్టత అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అక్కడే ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జ‌రుగుతుంది. మాల్‌కు సంబంధించిన నిర్మాణం పూర్తయింది. నేడు మల్టీప్లెక్స్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ సంద‌ర్భంగా  పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ క్లాస్ విజువల్స్, ఆడియో ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు రాబోతోన్న ఈ మల్టీప్లెక్స్‌ను AAAగా పిలవబోతోన్నారు. హైద్రాబాద్ ప్రజలను ఆకట్టుకునేలా, అలరించేలా ఈ మల్టీ ప్లెక్స్ తయారవుతోంది.