మిస్ , మిసెస్ ఇండియా ఫినాలే విన్నర్ గా సంజన !!

ఇండి రాయల్ సంస్థ ఆధ్వర్యంలో ఆరో ఎడిషన్ లో మిస్ & మిసెస్ ఇండియా – 2021 గ్రాండ్ ఫినాలే కాంపిటీషన్ బంజారాహిల్స్ లో జరిగింది, ఈ పోటీలో దేశ వ్యాప్తంగా 42 మంది ఫైనలిస్ట్ లను ఎంపిక చేసి వారితో ఫైనల్ కాంపిటీషన్ కండెక్ట్ చేశారు. ఇందులో హైదరాబాదీ యువతి సంజన విన్నర్ గా నిలిచి మిస్ ఇండియా 2021 కిరిటాన్ని ధరించారు.

పది రౌండ్ల చోప్పున కొనసాగిన ఈ పోటీల్లో మిస్ ఇండియా కిరీటం కోసం 10 మంది, మిసెస్ ఇండియా కిరీటం కోసం 17 మంది మిసెస్ ఇండియా క్లాసిక్ కిరీటం కోసం 15 మంది పోటీ పడ్డారు.

ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సినీ నటి అర్చన, తెలుగు ఫిలిం అసోషియేషన్ అధ్యక్షులు ఎం.వీర శంకర్ పలువురు పేజ్ త్రి ప్రముఖులు వ్యవహరించారు. సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో గెలిచిన విజేతలను నిర్వాహకులు అభినందించారు.