ఆ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ మళ్లీ రిపీట్

బాలీవుడ్‌లో స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేయడం కామన్. ఇప్పటికే బాలీవుడ్‌లో అనేకమంది స్టార్ హీరోలు కలిసి నటించారు. వారిలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ సూపర్ హిట్‌ అని చెప్పవచ్చు. గత ఏడాది వీరిద్దరు కలిసి నటించిన ‘వార్’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో వారిద్దరి మధ్య చోటుచేసుకునే యాక్షన్ సీన్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. దీంతో ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించింది.

hrithik roshan

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వనుందట. వార్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్‌తో పఠాన్ సినిమాను సిద్ధార్థ్ తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుండగా.. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా షూటింగ్ ముగిసే అవకాశముంది.

దీంతో పఠాన్ మూవీ షూటింగ్ ముగిసిన తర్వాత హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కించే అవకాశముంది. అయితే వార్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. మరికొందరు మాత్రం కొత్త కథతో సినిమా తెరకెక్కిస్తున్నారని చెబుతున్నారు.