Delhi: రైతుల‌కు మ‌ద్ద‌తుగా హాలీవుడ్ న‌టి..

Delhi: కేంద్ర ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తీసుకొచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ వ్య‌తిరేకంగా దిల్లీలో రైతులు ఉద్య‌మం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు ప్ర‌ముఖుల‌తో పాటు హాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా రైతుల‌కు మ‌ద్దుతు ఇస్తున్నారు. Delhi దీంతో మా విష‌యాల‌పై మీ జోక్యం ఎందుకు అంటూ కేంద్ర ప్ర‌భుత్వం ఆగ్రహాం వ్య‌క్తంచేసింది. హాలీవుడ్ పాప్ సింగ‌ర్ రిహానా రైతుల‌కు మ‌ద్ద‌తు తెలుప‌గా..

hollywood actresss

తాజాగా హాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి సుసాన్ స‌రాన్ డాన్ రైతుల‌కు మ‌ద్ద‌తు తెలిపారు. తాను రైతుల‌కు సంఘీభావం తెలుపుతున్న‌ట్టు సుసాన్ అన్న విష‌యాన్ని న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థ వెల్ల‌డించింది. ఇక ఇటీవ‌లే గ‌ణ‌తంత్ర దినోత్స‌వ సంద‌ర్భంగాDelhi దిల్లీలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌తో అంత‌ర్జాతీయంగానూ రైతు ఉద్య‌మం మీడియా దృష్టిని ఆక‌ర్షించింది. దీంతో రిహాన్నా, సుసానా వంటి ప్ర‌ముఖులు రైతుల‌కు సంఘీభావం తెలుపుతున్నారు. కాగా ఈరోజు రైతుల ఉద్య‌మం మ‌రింత తీవ్రంగా ఆందోళ‌న‌లు చేప‌ట్టారు.