మళ్లీ కాంబినేషన్ రిపీట్… దృశ్యం కన్నా మించి…

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్, మరోసారి సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి పని చేయబోతున్నాడు. ఇప్పటికే దృశ్యం, దృశ్యం 2 సినిమాలతో ఇండియా వైడ్ మూవీ లవర్స్ ని అట్రాక్ట్ చేసిన ఈ కాంబినేషన్ దృశ్యం 3ని సెట్స్ పైకి తీసుకోని వెళ్లడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈ సిరీస్ లో మూడో సినిమా స్క్రిప్ట్ వర్క్ ని స్టార్ట్ చేసిన జీతూ జోసెఫ్ టీం, దృశ్యం 3 స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగానే మరో సినిమాను లైన్ లో పెట్టబోతున్నారనే వార్త మల్లూవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ ప్రాజెక్ట్ ముందు రెండింటిలా క్రైమ్ థ్రిల్లర్ లా కాకుండా యాక్షన్ డ్రామాగా ఉండబోతుందట. దృశ్యం3 కంటే ముందే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందట. హిట్ కాంబినేషన్ అనే పేరు సంపాదించిన మోహన్ లాల్‌-జీతూ జోసెఫ్ చేయబోయే కొత్త సినిమా ఎలా ఉండబోతుంది? ఈసారి ఎలాంటి కథతో రాబోతున్నారు? లాంటి విషయాలు తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.