యువీ బ్యానర్ లో కార్తికేయ కొత్త సినిమా…

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘రాజా విక్రమార్క’ అనే సినిమాతో రాబోతున్నాడు. కార్తికేయ కెరీర్ లోనే హై బడ్జట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటిస్తున్న కార్తికేయ, త్వరలో ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లో మరో సినిమా చేయనున్నాడని ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ వైరల్ అవుతోంది. భారి సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో పాన్ ఇండియా సినిమాలతో పాటు మీడియం బడ్జెట్, చిన్న చిత్రాలు నిర్మిస్తున్నారు. అలానే ‘యూవీ కాన్సెప్ట్స్’ అనే అనుబంధ సంస్థలో చిన్న బడ్జెట్ సినిమాలను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా ‘ఏక్ మినీ కథ’ మూవీని నిర్మించి హిట్ అందుకున్నారు.

ఇదే క్రమంలో ఇప్పుడు కార్తికేయతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ అనే దర్శకుడిని ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారట. ఇక ఇందులో కార్తికేయకి జంటగా రుహానీ శర్మ నటిస్తోందని సమాచారం. ‘చి ల సౌ’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ ఆ తర్వాత ‘హిట్’, ‘డర్టీ హరి’ లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం దిల్ రాజు, క్రిష్ జాగర్లమూడి కలిసి నిర్మిస్తున్న ‘101 జిల్లాల అందగాడు’ సినిమాలో అవసరాల శ్రీనివాస్ సరసన నటిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యి తనని టాలీవుడ్ లో బిజీ చేస్తాయేమో చూడాలి.