ఘనంగా ”ఒక బృందావనం” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – తన తమ్ముడు చిత్రానికి ముఖ్య అతిధిగా నారా రోహిత్

కంటెంట్‌ను నమ్మి రాబోతున్న చిత్రం ”ఒక బృందావనం”. నూతన నటీనటులు బాలు, షిన్నోవాలతో పాటు శుభలేక శుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, డి.డి. శ్రీనివాస్ మరియు ఇతర సీనియర్‌ నటీనటులు ఈ చిత్రంలో నటించారు. బొత్స సత్య దర్శకత్వంలో కిషోర్‌ తాటికొండ, వెంకట్‌ రేగట్టే, ప్రహ్లాద్‌ బొమ్మినేని, మనోజ్‌ ఇందుపూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. మైత్రీ మూవీస్‌ ద్వారా ఈ నెల 23న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీరీలీజ్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కథానాయకుడు నారా రోహిత్‌ ముఖ్య అతిథిగా విచ్చేయగా, నిర్మాత సాహు గారపాటి, దర్శకుడు వీఎన్‌ ఆదిత్యలు విశిష్ట అతిథిలుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా నారా రోహిత్‌ మాట్లాడుతూ ” ఈ సినిమా కథ నాకు తెలుసు. ఇదొక ఇంట్రెస్టింగ్‌ అండ్ ఫీల్‌గుడ్‌ ఫిల్మ్‌. ఇదొక ఓ అబ్బాయి లైఫ్‌ జర్నీ. ఆర్టిస్ట్‌లు, టెక్నిషియన్స్‌ ఎంతో ఎఫర్ట్‌ పెట్టారు. సినిమా మీద పాషన్‌తో యూఎస్‌లో జాబ్‌ చేస్తూ ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాతో అందరికి మంచి సక్సెస్‌ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా పట్ల ఎంతో పాషన్‌తో ఉన్న హీరో బాలు. బాలు పర్‌ఫార్మెన్స్‌ అందర్ని అలరిస్తుంది. అందరూ ఈ సినిమా తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. అందరికి ఓ మంచి బ్యూటిఫుల్‌ సినిమాను చూశామన్న అనుభూతి కలుగుతుంది’ అన్నారు.

వీఎన్‌ ఆదిత్య మాట్లాడుతూ ” ఈ సినిమా నిర్మాతలతో నాకు మంచి జర్నీ ఉంది. ఈ సినిమా నేను చూశాను. ఈసినిమా చూసిన వారందరూ హీరో బాలు ప్రేమలో పడతారు. బాలుకు నటుడిగా మంచి భవిష్యత్‌ ఉంది. నిర్మాతలు ఎంతో నిజాయితీగా ఓ మంచి అటెంప్ట్‌ చేశారు. సినిమాను ఎలా తీయాలో నేర్చుకుని వచ్చి నిర్మాతలు ఈ సినిమా తీశారు. ఇది ఫ్యామిలీ డ్రామానేకాదు. ఓ మంచి యూత్‌ఫుల్‌ సినిమా అందర్ని అలరిస్తుంది” అన్నారు.

సాహు గారపాటి మాట్లాడుతూ ”ఈ సినిమా అందరి డ్రీమ్స్‌ను నేరవేరుస్తుందనే నమ్మకం ఉంది.హీరో అన్నింట్లో శిక్షణ తీసుకుని చేశారు. అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. తప్పకుండా ఈ చిత్రం అందరికి శుభారాంభాన్ని ఇస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

నిర్మాత మనోజ్‌ మాట్లాడుతూ ” ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికి థ్యాంక్స్‌. సినిమా చేసిన వాళ్లంతా టెక్నిషియన్స్‌ వర్క్స్‌ కూడా అప్రిషియేట్‌ చేస్తారు. అందరూ సినిమాకు బెస్ట్‌ ఇచ్చారు. అందరూ ఎంజాయ్‌ చేస్తూ ఈ సినిమా మేకింగ్‌ ప్రాసెస్‌ను ఫీల్‌ అయ్యాం’ అన్నారు.

మనో నిర్మాత కిషోర్‌ తాటికొండ మాట్లాడుతూ ” ఈ మూవీ మ్యూజికల్‌ జర్నీ. బ్యూటిఫుల్‌ విజువల్స్‌ ఉంటాయి. డీఓపీ ప్రతిభను అందరూ ప్రశంసిస్తారు. అందరూ తప్పకుండా థియేటర్‌లో చూడాల్సి సినిమా. ఎలాంటి అహింస తావు లేకుండా రూపొందిన ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. అందరూ కుటుంబంతో చూసి ఎంజాయ్‌ చేయాల్సిన సినిమా ఇది” అన్నారు.

హీరో బాలు మాట్లాడుతూ ” నారా రోహిత్‌, సాహు గారపాటిల సలహాలతో సినీ పరిశ్రమకు వచ్చాను. రోహిత్‌ అన్న గైడెన్స్‌ నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. నా కోసం రోహిత్ అన్న 250 పేజీల కథ కూడా చదివాడు. దర్శకుడు సినిమాను ఎంతో బాగా తెరకెక్కించాడు. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ ఇది. అందరి సపోర్ట్‌ నాకు కావాలి’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు సాకేత్‌, హీరోయిన్‌ షిన్నోవా, కెమెరామెన్‌ కె నల్లి, తదితరులు పాల్గొన్నారు.