Tollywood: ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అంటున్న గోపీచంద్‌..

Tollywood: టాలీవుడ్ యాక్ష‌న్ హీరో గోపీచంద్ ప్ర‌స్తుతం సీటీమార్ చిత్రాన్ని విడుద‌ల చేసే ప‌నుల్లో నిమ‌గ్న‌మయ్యాడు. ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. ఇందులో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. మ‌హిళా క‌బ‌డ్డీ కథాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీ‌నివాస్ చిట్టూరి నిర్మిస్తుండ‌గా.. సంప‌త్ నంది ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక ఈ చిత్ర అనంత‌రం మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు గోపీచంద్‌..

Tollywood మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రంలో గోపీచంద్ న‌టించ‌నున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శ‌నివారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. యువి క్రియేష‌న్స్‌, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2021 అక్టోబ‌ర్ 1న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని.. లాంచింగ్ డే రోజునే ప్ర‌క‌టించారు Tollywood చిత్ర‌బృందం. ఈ చిత్ర ప్రారంభోత్స‌వంలో అల్లు అర‌వింద్‌, గోపీచంద్‌, మారుతి, బ‌న్ని వాసు త‌దితరులు పాల్గొన్నారు. ఇక ఈ చిత్రంలో మ‌రోసారి గోపీచంద్ జోడీగాTollywood రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది.