గోపిచంద్ త‌ర్వాత సినిమా ఫిక్స్‌.. వెరైటీగా ప్ర‌క‌ట‌న చేసిన డైరెక్ట‌ర్ మారుతి

యాక్ష‌న్‌స్టార్ గోపిచంద్ హీరోగా ద‌ర్శ‌కుడు మారుతి సినిమా ఫిక్స్ అయింది. ఈ నేప‌థ్యంలోద‌ర్శకుడు మారుతి విభిన్నంగా సినిమా ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేశారు. ప్ర‌తిరోజు పండ‌గే త‌ర్వాత సినిమా ఇదే అంటూ.. ట్విట్ట‌ర్ వేదిక‌గా వీడియో ద్వారా గోపిచంద్ హీరోగా సినిమాను అనౌన్స్ చేశారు. ఈ వీడియోలో హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాలను చూపిస్తూ.. త‌న‌పై న్యూస్‌ఛానెళ్లు బ్రేకింగ్‌న్యూస్ చ‌దువుతున్న‌ట్టు చూపించారు. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా కొత్త సినిమా చేయ‌బోతున్న‌ట్టు డైరెక్ట‌ర్ మారుతి యూవీ క్రియేష‌న్స్ వారి యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోను త‌న ఫాలోవ‌ర్ల‌తో పంచుకున్నారు.

gopichand movie with maruthi

అలాగే ఈ కొత్త సంవ‌త్స‌రాన్ని పాజిటివిటితో మొద‌లుపెడుతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు పేర్కొన్నారు. కాగా అంద‌రికీ ఈ సంద‌ర్భంగా నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇక ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్‌, బ‌న్నీవాసు, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. త్వ‌ర‌లోనే మూవీ టైటిల్, ఫ‌స్ట్ లుక్‌ను మీ ముందుకు తీసుకొస్తానంటూ డైరెక్ట‌ర్ మారుతి తెలిపారు.