మరో గౌతమ్ నందా అవుతుందా?

దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న గోపీచంద్, ఇప్పుడు స్పీడ్ పెంచుతూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు. ఇప్పటికే చాణక్య సినిమాని రిలీజ్ కి రెడీ చేసిన గోపీచంద్ రీసెంట్ గా బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్ హౌజ్ లో ఒక మూవీ అనౌన్స్ చేసిన గోపీచంద్, పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో మొదటిసారి గోపీచంద్ పక్కన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ మూవీ సెట్స్ పై ఉండగానే గోపీచంద్, డైరెక్టర్ సంపంత్ నందితో మరో సినిమాని అనౌన్స్ చేశాడు. యూ టర్న్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో రూపొందనున్న ఈ సినిమాని హై బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రెస్టీజియస్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్ లో గౌతమ్ నందా సినిమా వచ్చింది. మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ నెమ్మదిగా మౌత్ టాక్ స్పెర్డ్ అయ్యి గోపీచంద్ కెరీర్ లోనే మంచి మూవీగా నిలిచిపోయింది. మరి ఈ రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.