గోపీచంద్-మారుతీ కాంబోలో మూవీ

హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఎవరనేది ప్రకటించకుండా కేవలం రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఇటీవల విడుదల చేసిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుర్చీలో ఖర్బీఫ్ వేస్తున్న ఒక ఫొటోను ఆ పోస్టర్‌లో పెట్టిన మేకర్స్.. అక్టోబర్ 1న సినిమా విడుదల కానుందని ప్రకటించింది. దీంతో హీరో, దర్శకుడు ఎవరనేది ప్రకటించకుండా ఏకంగా సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

gopichand and maruti movie

ఈ క్రమంలో ఎట్టకేలకు సినిమా వివరాలను ప్రకటించారు. వినూత్నంగా చేయడం కోసమే ఇలా చేశామని, ఒపికగా ఉన్నందుకు ధన్యవాదాలు అని తెలిపింది. గోపీచంద్ హీరోగా రానున్న ఈ సినిమాను మారుతీ తెరకెక్కించనున్నాడని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌2 సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం.