“ఫ్రెండ్ షిప్” హక్కులు సొంతం చేసుకున్న ఏ.ఎన్.బాలాజీ

‘క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్’ కలయికలో.25 కోట్ల భారీ బడ్జెట్‌తో తమిళంలో రూపొందుతున్న క్రేజీ చిత్రం “ఫ్రెండ్ షిప్” హక్కులు ప్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు శ్రీలక్ష్మీ జ్యోతి క్తియేషన్స్ అధినేత ఏ.ఎన్. బాలాజీ. ‘జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య’ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని “ఫ్రెండ్ షిప్” పేరుతోనే.. ‘సింగ్ అండ్ కింగ్’ అనే ట్యాగ్ లైన్ జోడించి.. తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు బాలాజీ సన్నాహాలు చేసుకుంటున్నారు. హర్భజన్ సింగ్ కు దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఈ చిత్రం హిందీలోనూ విడుదల కానుండడం విశేషం.

FRIENDSHIP RIGHTS

ఈ చిత్రం చివరి షెడ్యూల్ కోయంబత్తూర్, ఊటీలలో జరగనుంది. మాజీ’మిస్ శ్రీలంక’ మరియు తమిళ బిగ్ బాస్ విన్నర్ ‘లోస్లియా’ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో.. ‘జి-జాంబి’ హీరో ఆర్యన్ గౌడ్, ‘రంగస్థలం’ మహేష్, అంకిరెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎ స్ కె) విలన్ గా నటిస్తున్నారు.

శ్రీలక్ష్మి జ్యోతి క్తియేషన్స్ అధినేత ఏ.ఎన్.బాలాజీ మాట్లాడుతూ.. “ఇంత క్రేజీ ప్రాజెక్టును తెలుగులో రిలీజ్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం కోయంబత్తూర్, తదుపరి ఊటీలో చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వీలయినంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ బ్యాక్ డ్రాప్ లో- ప్రేమలు… గొడవలు మధ్య ఆద్యంతం ఉత్కంఠగా నడిచే ఈ చిత్రం యూత్ నే కాకుండా… అందర్నీ ఉర్రూతలూగిస్తుంది” అన్నారు.