నటుడిగానూ హర్భజన్ సింగ్ ఆడుకుంటున్నాడు: నిర్మాత ఏ.ఎన్.బాలాజీ


‘క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్’ కలయికలో… 25 కోట్ల భారీ బడ్జెట్ తో తమిళంలో రూపొందుతున్న క్రేజీ చిత్రం “ఫ్రెండ్ షిప్”.’జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య’ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని “ఫ్రెండ్ షిప్” పేరుతోనే.. ‘సింగ్ అండ్ కింగ్’ అనే ట్యాగ్ లైన్ జోడించి.. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాత ఏ.ఎన్. బాలాజీ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ కోయంబత్తూర్, ఊటీలలో జరుగుతోంది. మాజీ ‘మిస్ శ్రీలంక’ మరియు తమిళ బిగ్ బాస్ విన్నర్ ‘లోస్లియా’ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో.. ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎ స్ కె) విలన్ గా నటిస్తున్నారు.

Harbhajansingh


నిర్మాత-శ్రీలక్ష్మి జ్యోతి క్తియేషన్స్ అధినేత ఏ.ఎన్.బాలాజీ మాట్లాడుతూ… “క్రికెటర్ గా స్టేడియాల్లో అలవోకగా ఆడుకునే హర్భజన్ సింగ్… నటుడిగానూ ఎంతో ఈజ్ తో నటించారు. ఇంకా చెప్పాలంటే నటుడిగానూ ఆయన తనదైన శైలిలో ఆడుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ కలిగి ఉన్నప్పటికీ అందరితోనూ ఎంతో కలివిడిగా ఉంటుండడం మా యూనిట్ మెంబర్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు. ఈ చిత్రానికి మాటలు: రాజశేఖర్ రెడ్డి, సంగీతం: డి.ఎం.ఉదయ్ కుమార్, సినిమాటోగ్రఫీ: శాంతకుమార్, నిర్మాత: ఏ.ఎన్.బాలాజీ, దర్శకత్వం: జాన్ పాల్ రాజ్-శ్యామ్ స