ఈ మొదటి పాట వారిని సైలెంట్ చేయడానికేనా?

మూవీ మేకింగ్ మాస్టర్ రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న మాస్టర్ పీస్ సినిమా ఆర్ ఆర్ ఆర్. మాస్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ భారి మల్టిస్టారర్ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియా సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కరోనా కారణంగా డిలే అయిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకోని రావాలని ప్లాన్ చేసిన జక్కన్న, ట్రిపుల్ ఆర్ మూవీ ప్రమోషన్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే మేకింగ్ వీడియోతో ప్రకంపనలు సృష్టించిన రాజమౌళి, ఫస్ట్ సాంగ్ తో ప్రమోషన్స్ ని ఇంకో లెవెల్ కి తీసుకోని వెల్లబోతున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని ఆగస్ట్ 1, ఉదయం 11 గంటలకి రిలీజ్ చేయనున్నారు. తెలుగులో హిందీ భాషల్లో దోస్తీ పేరుతో రానున్న ఈ సాంగ్, తమిళ్ లో నట్పు, మలయాళంలో ప్రియం అనే పేర్లతో విడుదల కానుంది. ఎన్టీఆర్ చరణ్ మధ్య స్నేహాన్ని నిర్వచించేలా ఉండే ఈ సాంగ్ ని కీరవాణి ట్యూన్ చేయగా తెలుగులో హేమచంద్ర, తమిళంలో అనిరుద్, మలయాళంలో విజయ్ ఏసుదాస్, హిందీలో యాసీన్ నజీర్ పాడారు.

అయితే ఫస్ట్ సాంగ్ గా బయటకి రానున్న ఈ సాంగ్ అభిమానులని కూల్ చేయడానికి రాజమౌళి వేసిన మాస్టర్ ప్లాన్ లాగే కనిపిస్తోంది. ఎన్టీఆర్ టీజర్ లో కానీ, చరణ్ టీజర్ లో కానీ, మేకింగ్ వీడియోలో కానీ ఇప్పటివరకూ కలిసి కనిపించని చరణ్ ఎన్టీఆర్ లని కలిపి ఒక దెగ్గర చూపించడానికే ఈ సాంగ్ ప్లాన్ చేసినట్లు ఉన్నాడు రాజమౌళి. మెగా నందమూరి అభిమానులు మా హీరో గొప్ప అంటే కాదు మా హీరోనే గొప్ప అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. కాదు ఇద్దరూ గొప్పే, ఇద్దరూ ఒక్కటే, ఈ ఇద్దరిలో ఎవరు లేకున్నా ఈ సినిమా ఉండదు, వారి మధ్య స్నేహం ఎలా ఉంటుందో చూడండి అని చెప్పడానికే ఈ దోస్తీ సాంగ్ అన్నింటికన్నా ముందు బయటకి తెస్తున్నట్లు ఉన్నాడు రాజమౌళి. అందుకే దోస్తీ పాటని స్ట్రాటజికల్ గా ఫ్రెండ్షిప్ డే రోజునే రిలీజ్ చేస్తున్నాడు మన దర్శక ధీరుడు. ఈ పాట చూసాక అయిన సోషల్ మీడియాలో రెండు ఫ్యామిలీస్ ఫ్యాన్స్ కలిసి ఆర్ ఆర్ ఆర్ ని ఓన్ చేసుకుంటారేమో చూడాలి. ఇదిలా ఉంటే కొంతమందిలో ఇది ప్రమోషనల్ సాంగ్ అయి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఈ దోస్తీ సాంగ్ ప్రమోషన్స్ కి మాత్రమే పరిమితం అవుతుందా లేక సినిమాలో కూడా ఉంటుందా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాలి.