‘SPB’ అంత్యక్రియలకు అభిమానులకు అనుమతి లేదు?

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ఈ ఉదయం 10:30 గంటలకు తిరువల్లూరు జిల్లాలోని తమరాయిపక్కియంలోని తన ఫామ్‌హౌస్‌లో జరగనున్నాయి. ఇప్పటికే అక్కడ పరిసర ప్రాంతాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో బాలుగారికి తుది వీడ్కోలు పలకనున్నారు.

తిరువల్లూరు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బాలు అంత్యక్రియలకు అభిమానులను అనుమతి లేదని చెప్పారు. కరోనావైరస్ మహమ్మారి మధ్య ఉన్న ఆంక్షల కారణంగా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఫామ్‌హౌస్ ప్రాంగణంలోకి జనం రాకుండా ఉండటానికి ఫామ్‌హౌస్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. బాలు గారి పార్థివదేహాన్ని నిన్న రాత్రి ఆయన చెన్నై నివాసం నుండి తన ఫామ్‌హౌస్‌కు తీసుకువెళ్లారు. అనేకమంది సినీ పరిశ్రమ శ్రేయోభిలాషులు మరియు రాజకీయ నాయకులు ఆయనకు నివాళులు అర్పించడానికి ఫామ్ హౌజ్ కి చేరుకుంటున్నారు.