ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు, పండ్లు తినాలి -నందమూరి ‘వసుంధర దేవి’!!

సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చిన పంట ఉత్పత్తులను వినియోగించడంవల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నందమూరి వసుంధర దేవి అన్నారు . గండిపేట్ రోడ్ లోని కోకపెట్ లో ఏర్పాటైన ఫ్యూర్ ఓ న్యాచురల్ తెలుగు రాష్ట్రాల 33వ ఔట్లేట్ ను ఆమె ప్రారంభించారు .

_ఈ సందర్భంగా నందమూరి వసుంధర దేవి మాట్లాడుతూ ఫలాలు పరిరక్షణకు సంజీవిని గా పని చేస్తాయని అన్నారు. శరీరం లో రోగనిరోధక శక్తిని పెంచే, పండ్లు, ఆకు కూరలు తీసుకోవటం ఎంతో అవసరం అని అన్నారు యాంత్రిక జీవనంలా మారిన ఈ రోజుల్లో పండ్లు ఫలాలు, ఆకుకూరలు తీసుకోవటం మరింత అలవర్చుకోవాలని, అప్పడే ఉల్లాసంగా ఉండకలుగుతతామని అన్నారు.

_ప్యుర్ ఓ న్యాచురల్ వ్యవస్థాపకులు మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా వాషింగ్టన్ థాయిలాండ్ యు.ఎస్ వంటి దేశాల నుండి దిగుమతి చేసిన విభిన్న ఫలాలు అందుబాటులో ఉంటాయని, 25 రకాల విదేశీ తో పాటు ఆంధ్ర తెలంగాణ రైతులు పండించిన ఆకుకూరలు లభిస్తాయని అన్నారు.