Tollywood: “ఉప్పెన” చిత్ర క‌థ విని ఎంతో ఎగ్జైట్ అయ్యాను: దేవీశ్రీ‌ప్ర‌సాద్

Tollywood: మెగాహీరో పంజా వైష్ణ‌వ్‌తేజ్ న‌టించిన డెబ్యూ మూవీ ఉప్పెన‌. సుకుమార్ ద‌గ్గ‌ర ప‌నిచేసిన స‌హాయ‌ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు డైరెక్ష‌న్‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌.. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ల‌పై న‌వీన్ ఎర్నేని వై. ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ‌ప్ర‌సాద్ ఈ సినిమాకు స్వ‌రాలు అందించారు. దేవీశ్రీ‌ప్ర‌సాద్ కంపోజ్ చేసిన ఈ చిత్రంలోని నీ క‌న్ను నీలి స‌ముద్రం పాట ప్రేక్ష‌కులను ఎంతో ఆక‌ట్టుకుంది.

uppena dsp

ఇక ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.. దీంట్లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చాడు దేవీ.. Tollywood కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ చిత్రంపై దేవీ శ్రీ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు నాకు సుప‌రిచిత‌మే.. సుకుమార్ సినిమాల‌కు ప‌నిచేసేట‌ప్పుడు బుచ్చిబాబు త‌న‌కు సందేశాలిచ్చేవాడు.. అయితే Tollywood ఉప్పెన సినిమా క‌థ విని ఎంతో ఎగ్జైట్ అయ్యాను.. ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చినందుకు త‌న‌కెంతో గ‌ర్వంగా ఉందిని పేర్కొన్నారు దేవి. Tollywood అలాగే తాను జ‌ల జ‌ల ట్యూన్ బుచ్చికి పంపిన త‌ర్వాత.. ఆయ‌న నాతో.. నా క‌థ‌ను మీరు నాక‌న్నా బాగా అర్థం చేసుకున్నారు బుచ్చిబాబు అన్నార‌ని తెలిపారు.. అలాగే రీ రికార్డింగ్ త‌ర్వాత సినిమా చూసిన బుచ్చి న‌న్ను కౌగిలించుకుని విజ‌య్ సేతుప‌తిని సెల్ఫీలు అడ‌గ‌డానికి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డ‌తారు అని అన్నారని దేవీ శ్రీ‌ప్ర‌సాద్ పేర్కొన్నారు. ఇక ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుండ‌గా.. ఈ చిత్రం ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.‌