కరోనాతో ప్రముఖ బాలీవుడ్ నటి మృతి

సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు ప్రతిఒక్కరిని కరోనా ఇంకా భయపెడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా.. వారిలో చాలామంది కోలుకుని బయటపెట్టారు. మరికొంతమంది సెలబ్రెటీలను మాత్రం కరోనా బలి తీసుకుంది.ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలును కరోనా బలి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఒక ప్రముఖ బాలీవుడ్ నటి కరోనాకు బలైంది.

divya bhatnagar

ఆమె ఎవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్ నటి దివ్య భట్నగర్. నవంబర్ చివరి వారంలో ఆమె కరోనా బారిన పడగా.. కొద్దికాలంలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. వెంటిలేటర్‌పై కొద్దిరోజులుగా ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతోంది. అంతేకాదు ఆమెకు కరోనా పాటు న్యూమోనియా కూడా సోకింది.

దీంతో ఆమెను కాపాడేందుకు వైద్యులు ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తాజాగా మరణించింది. ఆమె మృతికి పలువురు పలువురు సినీ సెలబ్రెటీలు సంతాపం ప్రకటిస్తున్నారు. కొన్నిసినిమాల్లో నటించిన ఆమె.. ఎక్కువగా సీరియల్స్‌లో నటించింది.