కరోనాతో చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న నటి

కరోనా సామాన్య ప్రజలనే కాదు.. సెలబ్రెటీలను కూడా వణికిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారితో కొంతమంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. మరికొందరిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకగా.. ఆయన ఇతర వ్యాధులు కూడా ఉండటంతో మరణించారు. అలాగే ప్రముఖ బెంగాలీ నటుడు సుమిత్ర ఛటర్జీ కరోనా బారిన పడి మరణించారు.

divya bagnatakar

తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి దివ్య భట్నాగర్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత కొంతకాలంగా న్యూమోనియాతో దివ్య భట్నాగర్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా కూడా సోకింది. ఆమెకు వైద్యులు ఆక్సిజన్‌ని అందిస్తున్నారు.

నాన్-ఇన్వాసివ్ వెంటిలేషన్ నుంచి దివ్య భట్నాగర్ ను ఇటీవల వెంటిలేటర్‌కి మార్చారని ఆమె సోదరుడు దేవాషిష్ వెల్లడించారు. న్యూమోనియా ఉండడం వల్ల శ్వాససంబంధ సమస్య తీవ్రతరమైందని చెప్పాడు. పీపీఈ కిట్లతో వెళ్లి సోదరిని కలుస్తున్నానని తెలిపాడు.