గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న దర్శకులు ‘శేఖర్ కమ్ముల’ గారు!!

గౌరవ రాజ్యసభ సభ్యులు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొన్న శేఖర్ కమ్ముల గారు , లవ్ స్టోరీ సినిమా షూట్టింగ్ లో భాగంగా మొయినాబాద్ మండలం , కనకమామిడి గ్రామం లో రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు . అనంతరం తను మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారు , ఈ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి వాటిని కాపాడే బాధ్యత తీసుకునేలా అవగాహనా కల్పిస్తున్నారు . ఈరోజు పర్యావరణ ప్రేమికులు మొక్కలు నరకడం తట్టుకోలేక ఎంపీ సంతోష్ కుమార్ గారికి ట్విట్టర్ ద్వారా తెలియజేశారంటే అయన పర్యావరణ ప్రేమికుడిగా ఎంతగా గుర్తింపు పొందారో అర్ధం అవుతుంది . సీఎం కేసీఆర్ గారికి బాసటగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు . లవ్ స్టోరీ చిత్ర యూనిట్ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు .